ఉమ్మడి మెదక్ జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీ కొప్పెరి రమేష్ గారి కుమార్తె అనూష వివాహా మహోత్సవ12/20/2022 శనివారం (17.12.2022) రోజున సంగారెడ్డిలో ని Sri Aayi Mathaji మందిరంలో మన తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘము ఉమ్మడి మెదక్ జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీ కొప్పెరి. రమేష్ గారి కుమార్తె అనూష వివాహా మహోత్సవ కార్యక్రమముకు వచ్చి వధూ వరులను ఆశీర్వదించిన ఫోటో ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలీ ఉద్యోగుల సంఘము ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు-జట్ల. భాస్కర్,అసోసియేట్ అద్యక్షులు-ఆడెపు ఆంజనేయులు,ఉపాధ్యక్షులు-కవి వేణుగోపాల్,కార్యనిర్వాహక కార్యదర్శి-ముత్యాల సాయిప్రసాద్, మరియు TPRUS ప్రెసిడెంట్-గోల యాదగిరి, TPRUS ప్రధానకార్యదర్శి-జానకిరామ్ మొదలగువారు పాల్గొన్నారు.
0 Comments
pHతెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం 11-12-2022 తేదిన నిర్వహించిన పద్మశాలి వివాహ పరిచయ వేదికకు అపూర్వ స్పందన లభించింది. పెళ్లికోసం తగిన జోడిని వెతుక్కోవడం కష్టతరమైన ఈ రోజుల్లో యువతి, యువకులు పెళ్లికోసం పరిచయ వేదికలపైన ఆధారపడాల్సిన పరిస్థతి ఏర్పడింది.
ఈ క్రమంలో బాగ్ లింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం 2గంటల నుండి సాయంత్రం 5-30 ని.ల వరకు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం వారు నిర్వహించిన పద్మశాలి వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు జంటనగరాల నుంచి భారీ సంఖ్యలో యువతి, యువకులు వారి తల్లిదండ్రులతో సహా హాజరయ్యారు. తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం వారి ఆధ్వర్యంలో మ్యారేజ్ బ్యూరో హైదరాబాద్ ఉప్పల్ కార్యాలయంలో మరియు వరంగల్ బి.సి.నేత హాస్టల్ నందు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ వేదిక ద్వారా అనేక జంటలు ఒకటయ్యాయని, TPUS రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఈగ వెంకటేశ్వర్లు గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ లకుం నవీన్ రాజ్ కుమార్, కో కన్వీనర్ శిరందాసు యాదగిరేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరందాసు యాదగిరి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు బాసబత్తిని రాజేశం వివిధ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎనగండ్ల రాహుల్ కుమార్, శ్రీమతి పిట్ట ఉమాదేవి, శ్రీమతి గుజ్జరి శైలజ, పున్న శ్రీనివాస్, కడివేరు లక్ష్మీపతి, మెండు మృత్యుంజయ, చింతకింది శ్రీనివాస్, పున్న శ్రీనివాస్, కోడెం రవిప్రకాష్, గంజి రామ్మోహన్, ఆడెపు మల్లిఖార్జున్, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం, రాష్ట్ర కమిటీ ఎన్నికలు తేదీ: 11/12/2022 ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి హైదరాబాద్ లో శ్రీ కొండ యాదగిరి రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ పద్మశాలి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఎన్నికల అధికారిగారి ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి .
తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు అన్ని జిల్లాల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ( mahabubnagar జిల్లా మినహా )ఈ ఎన్నికలలో పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది . అద్యక్షులుగా శ్రీ ఈగ వెంకటేశ్వర్లు గారు హనుమకొండ, ప్రధాన కార్యదర్శిగా : శ్రీ తిరందాసు యాదగిరి గారు హైదరాబాద్, సహాధ్యక్షులుగా శ్రీ ఎనగండ్ల రాహుల్ కుమార్ మంచిర్యాల, ఉపాధ్యక్షులుగా గుండు శ్రీనివాస్ హైదరాబాద్, సామల ఉపేందర్ పెద్దపల్లి, ఇప్పకాయల విష్ణుమూర్తి హైదరాబాద్, లోకం రఘురాజ్ నిజామాబాద్, శ్రీమతి పిట్ట ఉమాదేవి జయశంకర్ భూపాలపల్లి, కోశాధికారిగా: లకుం నవీన్ రాజ్ కుమార్ సంయుక్త కార్యదర్శులుగా ఏలే బాలక్రిష్ణ భద్రాద్రి కొత్తగూడెం, ఆడెపు మల్లిఖార్జున్ హైదరాబాద్, కడవేరు లక్ష్మిపతి రాజు నిజామాబాద్, Dr. N.శ్రీనివాస్ మెదక్, కొండ బత్తుల రాజమౌళి వరంగల్, శ్రీమతి చింతకింది సుజాత హైదరాబాద్ ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా మామిడాల రవికుమార్ మెదక్, చిలుక శ్రీనివాస్ వరంగల్ ఆర్గనైజేషనల్ కార్యదర్శిగా శిరందాసు యాదగిరేందర్ హైదరాబాద్ ప్రచార కార్యదర్శిగా: వడ్లకొండ వెంకట్ రావు హైదరాబాద్ కార్యాలయ కార్యదర్శిగా: ములుక శ్రీనివాస్ వరంగల్ కార్యవర్గ సభ్యులుగా ఏ.రాజేందర్ నిజామాబాద్, తాటిపాముల దత్తాద్రి పెద్దపల్లి, నోముల చంద్రశేఖర్ హైదరాబాద్, జి. శ్రీనివాస్ రంగారెడ్డి, మెండు మృత్యుంజయ వరంగల్, కేమ జగదీశ్వర్ హైదరాబాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు, ఎన్నికల అధికారి శ్రీ కొండ యాదగిరి గారు తెలిపారు. హన్మకొండ,నవంబర్ 15-11-2022 తెలంగాణ సహకార గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు , TGOs అసోసియేషన్ జిల్లా కోశాధికారి ఈగ వెంకటేశ్వర్లు సతీమణి స్వర్గీయ ఈగ లావణ్య చిత్ర పటానికి నేతలు శుక్రవారం రాత్రి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈగ లావణ్య 1-11-2022 రాత్రి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే!
నేడు వారి స్వగృహమైన నక్కలగుట్ట నందు కీ.శే. ఈగ లావణ్య గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర అధ్యక్షులు ఏ జగన్మోహన్ రావు , రాష్ట్ర కార్యదర్శి ఆర్ శ్రీనివాస మూర్తి , కోశాధికారి గంధం శ్రీనివాసరావు , సహా అధ్యక్షులు నాగేశ్వర్ రావు నాయకులు మార్గం రాజేష్ , ఆర్ పరమేష్ తదితరులు పాల్గొన్నారు |






